నాడు-నేడుకి లారస్ ల్యాబ్స్ రూ.4 కోట్లు విరాళం..


Ens Balu
2
Tadepalle
2021-07-28 15:36:03

నాడు-నేడు పధకం రెండో విడతలో భాగంగా నాలుగు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో (తెనాలి, కంచికచర్ల, వీరులపాడు, అచ్యుతాపురం, పరవాడ) రాష్ట్ర ప్రభుత్వం  ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాల కల్పన నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి లారస్‌ ల్యాబ్స్‌ తరపున నాలుగు కోట్లరూపాయలను సీఈవో డాక్టర్‌ చావా సత్యనారాయణ విరాళంగా అందజేశారు. మొత్తానికి సంబంధించిన చెక్కును,  పత్రాలను ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌కు  అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లడుతూ, మూడు, నాలుగు విడతల్లో అదే మండలాల్లోని మిగిలిన పాఠశాలల్లో నేరుగా లారస్‌ ల్యాబ్స్‌ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు సీఎంకు కంపెనీ ప్రతినిధులు తెలియజేశారు.  లారస్‌ ల్యాబ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ చావా కృష్ణ చైతన్య, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ చావా నరసింహరావు, కనెక్ట్‌ టూ ఆంధ్ర సీఈవో వి. కోటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.