విజయవాడ చేరుకున్న ఒలింపిక్స్ కాంస్య పతక విజేత పీవీ సింధుకు ఘన స్వాగతం లభించింది. ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రి అవంతి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ నివాస్ తదితరులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పీవీ సింధు మాట్లాడుతూ.. ఒలింపిక్స్లో పతకం తేవడం సంతోషంగా ఉందన్నారు. ఒలింపిక్స్కు వెళ్లే ముందు అండగా ఉంటామని సీఎం జగన్ భరోసా ఇచ్చారని గుర్తు చేశారు. తనపై అభిమానం చూపిన వారికి పతకం అంకితమిస్తున్నానని సింధు చెప్పారు. తెలుగమ్మాయి ఒలింపిక్స్లో పతకం సాధించడం సంతోషంగా ఉందని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. యువత సింధును ఆదర్శంగా తీసుకోవాలన్నారు.