మరోసారి టిటిడి చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి..


Ens Balu
1
Tadepalle
2021-08-08 07:38:53

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డిని నియమిస్తూ దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి వాణీ మోహన్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు ఆదివారం జిఓనెంబరు 146 ను విడుదల చేశారు. మరికొన్ని రోజుల్లోనే ట్రస్టుబోర్డు సభ్యులను కూడా నియమిస్తామని కూడా ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టిటిడీ చైర్మన్ గా వైవీ ఇప్పటికే రెండేళ్లు చైర్మన్ గా పనిచేశారు. మళ్లీ ఆయననే ప్రభుత్వం చైర్మన్ గా తిరిగి నియమించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి తనను మరోసారి టిటిడి చైర్మన్ గా తిరిగి నియమించడానికి నిర్ణయం తీసుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. కాగా ఆయన చైర్మన్ గా ఉన్న సమయంలో ఎన్నో మంచికార్యక్రమాలు చేపట్టారు వైవీ..