ఆంధ్ర ప్రదేశ్ దేశ్ ఎస్సీ,ఎస్టీ గెజిటెడ్ అధికారుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం సోమవారం అమరావతిలో ఏర్పాటైంది. ఇందులో స్టేట్ జనరల్ బాడీకి యునానిమస్ గా జ్ఞానవేణి కుంచే వైస్ ప్రెసిడెంట్, రాజేష్ బాత అసోసియేట్ కార్యదర్శిలు స్థానం దక్కింది. ఇక కార్యవర్గం చూసుకుంటే ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్, ప్రెసిడెంట్ కె.వి రమణ, అసోసియేట్ ప్రెసిడెంట్స్ హరి దాస్ ఈరన్న, జనరల్ సెక్రటరీ ఎం సునీల్ కుమార్, సెక్రటరీ -కోఆర్డినేషన్ ఆర్. రాజా నాయక్,అడిషనల్ జనరల్ సెక్రెటరీ ఆర్ జయలక్ష్మి, ట్రెజరర్ సి.హెచ్ ఆనంద్, సెక్రెటరీ ఫైన్ ఆర్ట్స్ అండ్ ప్లానింగ్ డాక్టర్ ఎల్ ఆనంద్ కుమార్, యు పద్మావతి, రీజనల్ ప్రెసిడెంట్స్ ఎం రవికుమార్, కె.వి నాగజ్యోతి, ఎస్ కృష్ణా రావు,వెంకటేశ్వర్లు, పబ్లిసిటీ సెక్రెటరీ కొత్తపల్లి వెంకటరమణలుగా వున్నారు. ఈ కార్యవర్గం 2021-2024 వరకూ పనిచేస్తుందని ప్రచార విభాగం తెలియజేసింది.