ఏపీలో కొత్త కర్ఫ్యూ సడలింపులివే..


Ens Balu
1
Tadepalle
2021-08-17 15:17:37

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా వైరస్ కేసులు తగ్గుతున్న నేపథ్యంలో కోవిడ్ కర్ఫ్యూ సడలింపులు ప్రకటించింది. తాజాగా జారీ చేసిన నిబంధనల ప్రకారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటలవరకూ కర్ఫ్యూ సడలింపులు ఇస్తున్నట్టు ప్రకటించింది. తెల్లవారు జామున పెళ్లిళ్లు ఉంటే.. ముందస్తుగా అనుమతి తీసుకోవాలని, పెళ్లిళ్లలో 150 మందికే అనుమతి ఇవ్వాలని అధికారులను సిఎం వైఎస్. జగన్మోహనరెడ్డి ఆదేశించారు. ప్రతీ ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం ఎవరు మాస్కు ధరించకపోయినా ఫైన్లు వేయడం ద్వారా ఖచ్చితంగా మాస్కు ధారణ చేస్తారని అభిప్రాయ పడ్డారు.