మొహరం శెలవు తేదీ మార్పు..జీఓ జారీ


Ens Balu
0
Tadepalle
2021-08-18 14:21:45

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొహరం శెలవుతేదీని మార్పుచేస్తూ జిఓఎంఎస్ నెంబరు 1341, 1342 ను విడుదల చేసిందని మైనార్టీ సంక్షేమశాఖ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు తెలియజేశారు. ఈ మేరకు మీడియాకి ప్రకటన విడుదల చేశారు. వాస్తవానికి మొహరం పండుగ గురువారం వచ్చిందని, అయితే శుక్రవారం ముస్లిం కుటుంబాలకు ఎంతో పవిత్రమైన రోజని దానిని గుర్తించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. గురువారం ఆగస్టు 19 శెలవుకి బదులు ఆగస్టు 20న ప్రభుత్వ ఐచ్చిక శెలవును ప్రభుత్వం ప్రకటించినట్టు పేర్కొన్నారు.