అపోలో హాస్పిటల్స్ గ్రూప్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బులిటీ కింద కనెక్ట్ టు ఆంధ్రాకు రూ.2 కోట్లు విరాళం ప్రకటించింది. ఆ మొత్తానికి సంబంధించిన చెక్కులను అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్పర్సన్ ప్రీతా రెడ్డి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్.జగన్కు అందజేశారు. ఈ సందర్బంగా వారిని సీఎం వైఎస్ జగన్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆపోలో ప్రెసిడెంట్ (ప్రొక్యూర్మెంట్ అండ్ కార్పొరేట్ డవలప్మెంట్) నరోత్తమ్ రెడ్డి, సీఈఓ (ఏహెచ్ఈఆర్ఎఫ్) కె ప్రభాకర్, సీఈఓ (నాలెడ్జ్ వెర్టికల్) శివరామకృష్ణన్లు తదితరులు పాల్గొన్నారు.