శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి..


Ens Balu
2
Tirumala
2021-09-12 06:26:36

రాష్ట్ర‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ అరుప్ కుమార్ గోస్వామి ఆదివారం ఉద‌యం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, ఆలయ అర్చకులు ఇస్తీకఫాల్ స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం అద‌న‌పు ఈవో, సివిఎస్వోగోపినాథ్ జెట్టి శేషవస్త్రం, తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపట్టాన్ని ప్రధాన న్యాయమూర్తికి అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో  ర‌మేష్ బాబు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.