శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం..


Ens Balu
1
Tirumala
2021-10-11 14:52:47

శ్రీవారి  బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా సోమ‌వారం రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వరస్వామివారికి పట్టువస్రాలు సమర్పించారు. ముందుగా  సీఎం శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం వద్దకు చేరుకున్నారు. వారికి ఆలయ అర్చకులు  పరివట్టం కట్టారు. అక్కడినుంచి పట్టువస్త్రాలను తలపై ఉంచుకుని  మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆల‌యానికి చేరుకుని స్వామివారికి వస్త్రాలు సమర్పించారు. అంతకుముందు టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు  వైవి.సుబ్బారెడ్డి, కార్యనిర్వహణాధికారి డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి కలిసి స్వాగతం పలికారు. దర్శనానంతరం ముఖ్యమంత్రికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వ‌చ‌నం చేశారు. శ్రీవారి తీర్థప్రసాదాలు,  డ్రైఫ్లవర్ టెక్నాలజీతో చేసిన స్వామివారి చిత్రపటం, కాఫీ టేబుల్‌బుక్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, ఉపసభాపతి కోన రఘుపతి, మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతమ్ రెడ్డి,  కన్నబాబు,  కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, ఎంపీలు గురుమూర్తి, మిథున్ రెడ్డి,  వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,  మార్గాని భరత్,  రెడ్డెప్పరెడ్డి, ఎమ్మెల్యేలు  కరుణాకర్ రెడ్డి,  రోజా,  బియ్యపు మధుసూదన్ రెడ్డి, వెంకటే గౌడ,  ఆదిమూలం,  చింతల రామచంద్రారెడ్డి,  ఆరణి శ్రీనివాసులు,  మేడా మల్లికార్జున రెడ్డి,  తిప్పేస్వామి, ఆర్.ప్రతాప్ కుమార్ రెడ్డి, చిత్తూరు జడ్ పి ఛైర్మన్  శ్రీనివాసులు, బోర్డు సభ్యులు  ప్రశాంతి రెడ్డి,  పోకల అశోక్ కుమార్, కాటసాని రాంభూపాల్ రెడ్డి,  మధుసూదన్ యాదవ్,  కె.సంజీవయ్య, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి  వాణీ మోహన్, జిల్లా కలెక్టర్  హరినారాయణన్, టిటిడి సివిఎస్వో  గోపినాథ్ జెట్టి, అర్బన్ ఎస్పీ  వెంకట అప్పలనాయుడు, తిరుపతి కార్పొరేషన్ డెప్యూటీ మేయర్  భూమన అభినయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.