2022 టిటిడి డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించిన సీఎం వైఎస్.జగన్
Ens Balu
2
Tirumala
2021-10-11 17:21:33
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఐదో రోజైన సోమవారం రాత్రి స్వామివారి దర్శనానంతరం రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైఎస్.జగన్మోహన్రెడ్డి టిటిడి ముద్రించిన 2022వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లను ఆలయంలో ఆవిష్కరించారు. 12 పేజీల క్యాలెండర్లు 15 లక్షలు, పెద్ద డైరీలు 8 లక్షలు, చిన్నడైరీలు 2 లక్షలు, టేబుల్ టాప్ క్యాలెండర్లు లక్ష, శ్రీవారి పెద్ద క్యాలెండర్లు 3.5 లక్షలు, శ్రీ పద్మావతి అమ్మవారి పెద్ద క్యాలెండర్లు 10 వేలు, శ్రీవారు, శ్రీపద్మావతి అమ్మవారి క్యాలెండర్లు 4 లక్షలు, తెలుగు పంచాంగం క్యాలెండర్లు 2.50 లక్షల కాపీలను టిటిడి ముద్రించింది. ఇవి తిరుమల, తిరుపతిలోని టిటిడి పుస్తక విక్రయశాలల్లో అందుబాటులో ఉన్నాయి. వారం రోజుల్లో ఇతర ప్రాంతాల్లోని టిటిడి సమాచార కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతారు.