హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రవినాథ్ తిల్హరి..
Ens Balu
3
Tadepalli
2021-10-18 08:30:01
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం న్యాయమూర్తిగా జస్టిస్ రవినాథ్ తిల్హరి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఉదయం రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం మొదటి కోర్టు హాల్ లో జరిగిన ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో తొలుత భారత రాష్ట్రపతి జారీచేసిన నోటిఫికేషన్ ఆర్డరును రిజిస్ట్రార్ జనరల్ బి.ఎస్.భానుమతి చదివి వినిపించారు. అనంతరం రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా జస్టిస్ రవినాథ్ తిల్హరితో న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయించారు. న్యాయమూర్తులు జస్టిస్ శేషసాయి, జస్టిస్ దుర్గాప్రసాద్, జస్టిస్ సత్యనారాయణమూర్తి, జస్టిస్ గంగారావు, జస్టిస్ వెంకటరమణ, జస్టిస్ రఘనందనరావు, జస్టిస్ బి.కృష్ణమోహన్, జస్టిస్ సురేష్ రెడ్డి, అడ్వకేట్ జనరల్ శ్రీరామ్, రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ ఘంటా రామారావు, రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్స్ అసోషియేషన్ అద్యక్షులు కె.జానకి రామి రెడ్డి, సీనియర్ అడ్వకేట్స్, అడ్వకేట్స్,రిజిస్ట్రార్స్ తదితరులు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు.