విజయనగరం వసతి దీవెన రూ.46.21కోట్లు


Ens Balu
4
Vizianagaram
2022-04-08 11:10:27

విజయనగరం జిల్లాలో జగనన్న వసతి దీవెన 2021-22  సంవత్సరానికి 2వ విడత నిధులను రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం విడుదల చేసారు. ఇందులో విజయనగరం జిల్లాకు చెందిన  48,210 మంది విద్యార్థులకు గానూ 46.21 కోట్ల రూపాయలను విడుదల చేశారు.  వీరిలో బి.సి కు చెందిన విద్యార్థులు 39,205 మంది, ఎస్.సి 4,310, ఈ బిసి 2,818 మంది ఉండగా ఎస్.టి 617, కాపు 974, ముస్లింలు 246, క్రిస్టియన్ విద్యార్థులు 40 మంది ఉన్నారు. ఇందులో డిగ్రీ, ఇంజినీరింగ్, ఫార్మసీ, పోలీటెక్నిక్, ఐ.టి.ఐ, మెడికల్, నర్సింగ్, అగ్రికల్చర్, హార్టికల్చర్, డి ఎడ్, బి ఎడ్, బి పి ఎడ్ చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులు  ఉన్నారు. 
ఈ కార్యక్రమం లో  నంద్యాల జిల్లానుండి ముఖ్యమంత్రి పాల్గొని నిధులు విడుదల చేయగా లైవ్ టెలికాస్ట్ లో  వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి  జిల్లా  కలెక్టర్ ఎ. సూర్య కుమారి, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎం.ఎల్.సి రఘురాజు, ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి,సోషల్ వెల్ఫేర్ డిడి సునీల్  రాజ్ కుమార్, డిబిసిడబ్లు కీర్తి, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అనంతరం మెగా చెక్కును లబ్ధిదారులకు అందజేసారు.