రూ.350 కోట్లు మడత పెట్టేశారట..? డ్రెజ్జింగ్ కార్పోరేషన్ లో డీజిల్ స్కామ్..!


Ens Balu
239
visakhapatnam
2025-05-31 15:32:21

డ్రెజ్జింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా..ఈ కేంద్రప్రభుత్వ సంస్థ చాలా మందికి పెద్దగా పరిచియం లేని పేరు.. ఎప్పుడైనా సముద్రంలో ఇసుక మేటలు వేస్తే మాత్రం సముద్రంలోకి బడా బడా వెసల్స్ వచ్చి ఇసుకను బయటకు తోడుతాయి. చూడటానికి చాలా వింతగా కూడా కనిపిస్తుంటుంది. అలాంటి వింతలపై స్కెచ్ వేసి.. కోట్లు కొల్లగొడతారని ఎవరూ ఊహించరు.. అదే అలుసుగా తీసుకున్న డిజిసిఐ సంస్థకు చెందిన అధికారులు, ఏజెంట్లు.. వందల కోట్ల రూపాయల డిజీల్ బిల్లుల్లో లెక్కల్లో బొక్కలు చూపించి భారీ స్థాయిలో నొక్కేశారట. విషయం బయటకు రాకుండా ఇద్దరు ప్రజాప్రతినిధులకు కూడా వాటాలు ఇచ్చారట. అయితే అడక్కుండా ఎందుకు వాటాలిస్తున్నారనే విషయంపై ఆరా తీస్తే వందల కోట్లలో తేడాలు వచ్చాయని బయటకు వచ్చిందని.. ఇదే అంశంపై పలు దఫాలు సమావేశాలు జరిగాయని కూడా చెబుతారు.. ఆ విషయం కాస్త సంస్థలోని వారు, సంస్థకు డీజిల్ సరఫరా చేసిన ఇండియన్ ఆయిల్ కంపెనీలోని ఏజెంట్లు.. ఆ విషయాన్ని ఇద్దరికే( ఒకటి అడిగిన వాడికి.. రెండూ అడగని వాడికి) చెప్పడం మొదలు పెట్టారు. దీనితో విషయం  గుప్పుమంది.. కొందరు సమాచార ప్రతినిధులు విషయం తెలుసుకొని చల్లగా వారి పని వాళ్లు కానిచ్చేశారు కూడా.. ఎవరికీ తెలియదనుకుంటున్నా డీజిల్ పొస స్కామ్  విశాఖలో ఇదే హాట్ టాపిక్..!

సముద్రంలో మేటలు వేసిన ఇసుకను ఒడ్డుకి తోడి సముద్ర అలల నుంచి ఒడ్డు ప్రాంతానికి రక్షణ కల్పించడానికి డ్రెజ్జింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా భారీ వెసల్స్ తో ఇసుకను ప్రతీ ఏటా తవ్వుతుంటుంది. దానికి పోయి వందల కోట్లలో తేడాలు ఎందుకు వస్తాయని అందరూ అనుకోవచ్చు మీరంతా. ఇక్కడే అధికారులు, ఏజెంట్లు, ఆయిల్ కంపెనీలు, డ్రెజ్జింగ్ కి వెసల్స్ కి మరమ్మతులు చేసే సంస్థలు, సొంత వెసల్స్ లోని సిబ్బంది, అధికారుల బుర్రలు పాదరసంలా పనిచేస్తాయి. ఆ తెలివితోనే సముద్రంలోని ఇసుకను బయటకు తోడినంత సులువుగా వందల కోట్ల రూపాయలను ఎవరికీ తెలియకుండా మడత పెట్టేస్తారు. అసలు డ్రెజ్జింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలోని స్కామ్ ఏ విధంగా జరుగుతుందో తెలిస్తే మీకు కళ్లు బైర్లు కమ్ముతాయి. దానితో మీరే అధికారులు ఏస్థాయిలో ప్రభుత్వానికి మస్కా కొట్టి పెద్ద మొత్తంలో నొక్కేస్తుంటారో చెప్పేస్తారు. అదే జరిగిందిట ఇప్పుడు కూడా. సాధారణంగా డిజిసిఐ డ్రెజ్జింగ్ వెసల్స్ సముద్రంలో ఇసుక మేటలను తోడే సమయంలో వెసల్స్ కి వందల వేల లీటర్లలో డీజిల్ అవసరం పడుతుంటుంది. అదే సమయంలో లేని మరమ్మతులు కూడా తెరపైకి వస్తాయి. 

అదేమంటే నిరాటంకంగా డ్రెజ్జింగ్ వెసల్ పనిచేస్తున్నప్పుడు మరమ్మతులకు గురైందని.. దానిని రిపేరు చేయాలంటే లక్షల్లో ఖర్చు అయిందని కూడా చెబుతారు. మరమ్మతులు అయితే లక్షలే అదే గంటల కొద్దీ వెసల్ ఇసుకతవ్వే సమయంలో వేల లీటర్ల డీజిల్ ఖర్చు అవుతుందంటూ లెక్కలు చూపించి మరీ బిల్లుల్లోనూ అడ్డంగా నొక్కేస్తున్నారు. అదీ ఎలా అంటే ఒక్కో డ్రెజ్జింగ్ వెసల్ ఇంజన్ ఆన్ లో ఉన్నప్పుడు గంటకు 30 నుంచి 50 లీటర్లు డీజిల్ కాలుతున్నట్టుగా లెక్కలు చూపిస్తున్నారట. వాస్తవానికి ఏ వెసల్ కి ఎంత మొత్తంలో డీజిల్ ఖర్చు అవుతుందనే విషయం చాలా ఏళ్లనుంచి అధికారులు కూడా సక్రమంగా లెక్కలు వేయలేదు. కేంద్రంలోని ఉన్నతాధికారులు ఇక్కడ డీజిల్ ఖర్చు.. దానిలోని కాకమ్మ లెక్కలు నమ్మే పరిస్థితి లేకపోతే.. ఇంత మొత్తంలో మడత పెట్టడానికి అవకాశం ఉండేది కాదేమోంటు అంటున్నారు విశ్లేషకులు. మన దగ్గరున్న డ్రెజ్జింగ్ వెసల్స్ అన్నీ కూడా చాలా పాతవని.. అందుకే డీజిల్ వినియోగం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారట. అయితే దానిని డిజిసిఐలోని ఉన్నతాధికాకులు నమ్మి అదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సి వుంటుంది. 

అలా తీసుకెల్లడానికే డీజిల్ బిల్లులో భారీ స్థాయిలో నొక్కేసిన మొత్తాన్ని అధికారుల హోదాకి తగ్గట్టుగా పంపకాలు చేసుకొని.. రేపన్నారోజు ఏ ప్రజాప్రతినిధి మాట్లాడకుండా ముందుగానే వారిని ప్రశన్నం చేసుకొని వారికి కూడా వాటాలు సమర్పిస్తున్నారని తెలుస్తుంది. అయితే ఇదంతా ఢిల్లీ, ముంబై కేంద్రాల్లోని కార్యాలయ అధికారులకు తెలియకుండానే జరుగుతుందా అంటే అంతా తెలిసే జరుగుతుందని.. విశాఖ నుంచి ఢిల్లీ, ముంబై కార్యాలాయల్లోని అధికారులకు కూడా డీజిల్ స్కామ్ లోని వాటాలు వెళుతున్నట్టుగా ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ఇదే విషయమై విశాఖలోని డిజిసిఐ అధికారులను వివరణ కోరేందుకు ఈరోజు-ఈఎన్ఎస్ ప్రయత్నించగా ఎవరూ అందుబాటులోకి రాలేదు. ఒకరిద్దరు చోటా  అధికారులు అడక్కుండానే ముందుకి వచ్చి ఏ మీడియాకి డిజిసిఐ లోని డీజిల్ లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదన్నట్టుగానే మాట్లాడుతుండటాన్ని బట్టి విషయం ఏస్థాయికి చేరిందో అర్ధం చేసుకోవచ్చు. ఎంత మొత్తానికి డీజిల్ బిల్లుల రూపంలో మడత పెట్టారో కూడా వేరేగా చెప్పాల్సిన పనిలేదు.

-విషయం బయటకు రాకుండా ఒక అధికారి బదిలీ
డిజిసిఐలో వేల లీటర్ల ఖర్చు అయినట్టుగా చూపిన డీజిల్ స్కామ్ విషయం తెలిసిన ఒక అధికారిని మూడో కంటికి తెలియకుండా కేంద్ర కార్యాలయానికి బదిలీల చేసినట్టు తెలిసింది. మరో అధికారికి వార్నింగ్ ఇచ్చి.. విషయం మీడియాకి తెలిస్తే.. నువ్వు దానిని బయట పెట్టినట్టుగా భావించాల్సి వస్తుందని కూడా చెప్పారట. అయితే ఈ పంపకాల విషయం మాత్రం ఓ ఇద్దరు ప్రజాప్రతినిధులు ఓ స్టార్ హోటల్ లో చర్చించుకున్న తరువాతనే అక్కడి నుంచి విషయం బయటకు వచ్చినట్టు చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకూ సుమారు  రూ.350 కోట్లకు పైనే డీజిల్ లెక్కల్లో బొక్కలు పెట్టి అందిన కాడికి మొత్తం నొక్కేశారట. విషయాన్ని సంస్థకు చెందిన కొందరు ఉద్యోగులకు, ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ కి చెందిన సిబ్బంది కూడా సమాచారాన్ని కేంద్రం ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లడంలో విచారణకు వచ్చిన అధికారికి కూడా కోట్లలోనే ముడుపులు ఇచ్చినట్టు వార్తలు బయటకు వస్తున్నాయి.

విచారణ అధికారులకు, ప్రజాప్రతినిధులకు, సంస్థలోని ముఖ్య అధికారులుకు వెసల్ నిర్వాహకులకు, కొన్ని ఆంగ్ల మీడియా సంస్థలకు, మరికొందరు తెలుగు సమాచార ప్రతినిధులకు పెద్ద మొత్తంలో ముడుపులు ఇచ్చిన కారణంగానే ఇన్నికోట్ల రూపాయల డీజిల్ స్కామ్ ఇప్పటి వరకూ బయటకు రాకుండా ఉండిపోయిందని చెబుతారు. చూడాలి ఇంత పెద్ద మొత్తంలో జరిగిన డ్రెజ్జింగ్ కార్పోరేషన్ డీజిల్ స్కామ్ వ్యవహారంలో అధికారులు ఏ విధంగా స్పందిస్తారు.. ఫిర్యాదులు వెళ్లిన సిబిఐ ఎలా కేసుని విచారణ చేస్తుంది.. ఈ సీన్ లో ఉన్న ఇద్దరు ప్రజాప్రతినిధులు ఎవరనే విషయం త్వరలోనే బయటకు వచ్చే అవకాశాలున్నాయి..?!
సిఫార్సు