విశాఖపట్నం పేరుకే అందమైన మహానగరం.. మంచినీరు తాగుదామంటే ఎక్కడ బోరు వేసినా అంతా ఉప్పునీరే.. సిటీ ఆఫ్ డెస్టినీగా పేరుగాం చిన విశాఖల విశాఖలో రానున్న రోజుల్లో మంచినీరు చాలా ఖరీదు కానున్నది. దానికి కారణం కూడా లేకపోలేదు. ఇబ్బడి ముబ్బడిగా తవ్వేస్తున్న బోర్లు విశాఖనగరంలోని భూగర్భ జలాలను హరించి వేస్తున్నాయి. నీటిని వినియోగించుకున్నవారు కనీసం వాడేసిన నీటినైనా భూమిలోకి పంపే ప్రయత్నం చేయడంలేదు. వాడుక నీరు కూడా మురికి కాలువల ద్వారా సముద్రంలోనే కలిసిపోతున్నది. అదే ప్రతీ ఇంటి దగ్గర ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుంటే.. భూగర్భ జలాల్లో అడుగంటిపోతున్న మంచినీటికి మళ్లీ జీవం రావడానికి అవకాశం వుంటుంది. కానీ ఆ పరిస్థితి మహా విశాఖ నగరంలో వున్న ప్రజలకు పట్టడం లేదు. అలాగని మహా విశాఖనగరపాలక సంస్థ కూడా రానున్న పెను ఉపద్రవాన్ని అంచనా వేయడం లేదు.
అన్నీ అనుకూలించి పోలవరం ప్రాజెక్టు పూర్తయితేనే రానున్న రోజుల్వో విశాఖ నగరవ వాసులకు మంచినీరు వస్తుంది. లేదంటే ఇతరరాత్రా మంచినీటి వనరులు ఎంతకాలమో నగర ప్రజల దాహార్తిని తీర్చలేవు. ఒక రకంగా చెప్పాలంటే అరబ్ దేశాల పరిస్థితి వచ్చేలా ఉంది ఇక్కడ కూడా. ప్రస్తుతం మహావిశాఖ నగర పరిధిలో భూ గర్భంలో మంచినీటి జల ఇంకి పోయి.. ఉప్పునీటి జల పైకివచ్చేసింది. ఇపుడు ఎక్కడ బోరుబావులు తవ్వినా అదే ఉప్పునీరు వస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే రోజుల్లో ఆ ఉప్పునీరు కూడా బోరుబావుల్లోకి వచ్చే పరిస్థితి ఉండదు. మంచినీటి గండం నుంచి బయట పడాలంటే మాత్రం ఖచ్చితంగా విశాఖలో ఎన్ని ఇళ్లున్నాయో ప్రతీ ఒక్కరూ ఇంకుడు గుంతలను తవ్వించుకొని.. ఖచ్చితంగా వాడుక నీటిని భూమిలోకి పంపాల్సిన సమయం ఆశన్నమైంది. ఇదేదో విశాఖ వాసులను భయపెట్టడానికో, మరెందుకో చెప్పడంలేదు. విశాఖమహానగరం రానున్న రోజుల్లో ఎదుర్కోబోయే మంచినీటి గండాన్ని ముందుగానే ప్రస్తావించాల్సిన సమయం వచ్చినందున చెప్పాల్సి వస్తున్నది.
ప్రస్తుతం అందరి ఇళ్లల్లో ఉన్న బోర్లలో ఉప్పునీరు, చప్పటి నీరు వస్తుండటంతో ప్రతీ ఒక్కరూ స్నానాలకు బోరు నీరు.. త్రాగడానికి మినరల్ వాటర్ కొనుక్కోవాల్సి వస్తున్నది. ఫలితంగా విశాఖలో 25 లీటర్ల మంచినీటి క్యాన్ రూ.50 నుంచి 200 వరకూ ధర పలుకుతుంది. అదీ ఆయా కంపెనీలను బట్టి. అదే మంచినీరు పూర్తిగా ఇంకిపోతే విశాఖ వాసుల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచన చేస్తేనే అది అత్యంత భయంకరంగా వుంటుంది. పేరుకి అందమైన నగరం.. త్రాగడానికి మంచి నీరు మృగ్యం అని ఇకపై అన్ని మీడియాలో ప్రధాన శీర్షికలతో వార్తలు వచ్చే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి. పర్యావరణ వేత్తలు ప్రజలను ఎంత చైతన్యం చేస్తున్నప్పటికీ అవగాహన, చలనం మాత్రం కొంత మందిలోనే వస్తున్నది. చాలా మంది వాడుక నీటిని భూగర్భ కాలువల్లోకే విడిచి పెడుతున్నారు. విశాఖవాసులు.. విశాఖ వచ్చి స్థిరపడాలనుకున్నవారికి ఒక భయకరమైన రహస్యం కూడా చెప్పాలి. రాష్ట్రంలో అత్యధికంగా సాల్ట్ వాటర్ ఫ్యూరి ఫయర్స్ విశాఖలోనే సేల్ అవుతున్నాయి.
ఈ విషయం మహా విశాఖ నగరంలోని ఏర్పాటవుతున్న సాల్ట్ వాటర్ ప్యూరి ఫైయర్స్ ఏర్పాటు చేస్తున్న ప్రాంచైలీజే స్పష్టం చేస్తున్నాయంటే విశాఖ వాసులు ఉప్పునీటిని మంచినీరుగా.. వాడుక నీరుగా మార్చుకోవడాని ఏ స్థాయిలో వీటిపై ఆధార పడుతున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇలాంటి సాల్ట్ వాటర్ ఫ్యూరి ఫైయర్స్, సాల్ట్ వాటర్ ఫిల్టర్స్ అధికంగా వినియోగిస్తున్న విశాఖ వాసులు ఇంకుడు గుంతలను మాత్రం తవ్వించడం లేదు. కనీసం ప్రభుత్వమైనా ఆ పనికి పూనుకుకుంటే విశాఖ వాసులకు మంచినీరు రానున్న రోజుల్లోనైనా దక్కే అవకాశాలుంటాయి. లేదంటే మహావిశాఖ నగర పాలక సంస్థ సరఫరా చేసే మంచినీరు, బయట అధిక మొత్తం వెచ్చించి కొనుక్కునే మినరల్ వాటర్ మాత్రమే దక్కుళ్లు అవుతాయనడంలో అతిశయోక్తి కాదేమో. అందులోనూ అడపా దడపా ప్రైవేటు కంపెనీలు, ప్రైవేటు ఆసుపత్రులు, ప్రైవేటు కాలేజీలు, గ్రూప్ హౌస్ నిర్వాహకులు తవ్వేస్తున్న వేల అడుగుల బోరుబావుల వలన ఆ చుట్టుప్రక్కల వుండేవారికి ఎండాకాలంలో నీరు కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోతుంది.
అలాంటి ప్రాంతాల్లో ముఖ్యమైనవి ఆరిలోవ, సీతమ్మధార, ఎండాడ, మధురవాడ, బీచ్ రోడ్డు, కేజీహెచ్ ఏరియా, మర్రిపాలెం, 104 ఏరియా, మాధవ ధార, ఎన్ఏడి కొత్తరోడ్డు, గోపాలపట్నం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రాంతాల్లో ఎండాకాంలో చాలా ఇళ్లలో బోరు బావులు పనిచేయవు. పనిచేయవంటే కరెంటు లేకపనిచేయడం కాదు ఆయా ప్రాంతాల్లో ప్రైవేటు సంస్థలు తవ్వేసిన బోరుబావుల వలన పూర్తిగా భూగర్భ జాలాలు అడుగింటి పోతున్నాయి. ఈ పరిస్థితి విశాఖ మహానగరం మొత్తం వ్యాప్తిచెందకుండా ఉండాలంటే ప్రతీ ఒక్కరూ ఇంకుడు గుంతలు ప్రతీ ఇంటి దగ్గరా తవ్వించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. లేదంటే మరో ఐదు, పదేళ్లు దాటితే ఉన్న ఆ కాస్త మంచినీటి జల పూర్తిగా ఇంకి పోయి జీవితాంతం ఉప్పునీటితోనే అన్ని అవసరాలను తీర్చుకోక తప్పదు.. పారాహుషార్.. ?!