ఇక తాడో పేడో.. విశాఖలో కదంతొక్కిన సచివాలయ ఉద్యోగులు..!


Ens Balu
132
Visakhapatnam
2025-06-23 14:57:15

విశాఖలో గ్రమ, వార్డు సచివాలయ ఉద్యోగులు కదం తొక్కారు.. ప్రధాన సమస్యలతోపాటు, ఆర్ధికేతర అంశాలు పరిష్కరించకపోతే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. సోమవారం ఈ మేరకు జీవిఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తు ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. ఉద్యోగ సంఘాల జేఏసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ భారీ నిరసన కార్యక్రమంలో ఉద్యోగులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను మీడియా ముందు ఏకరువు పెట్టారు సచివాలయ ఉద్యోగులు. ఆంధ్రప్రదశ్ ప్రభుత్వంలో 75 ప్రభుత్వశాఖలుంటే.. 75వ శాఖగా గ్రామ, వార్డు సచివాలయ శాఖను ఏర్పాటు చేసిన గత ప్రభుత్వం కనీసం తమ శాఖకు చట్టబద్దత కూడా కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేటికి ఆరేళ్లు గడుస్తున్నా కూటమి ప్రభుత్వం కూడా తమ ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగుల కంటే చాలా చిన్నచూపు చూస్తుందని వాపోయారు.

 దేశంలో ఎక్కడైనా ఒక ప్రభుత్వశాఖ ఏర్పాటు చేసిన దానికి క్యాబినెట్ లో ఆమోదం తెలిపి అసెంబ్లీలో చట్టబద్దత తీసుకువచ్చి, గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తుందని.. కానీ గతం ప్రభుత్వం క్యాబినెట్ లో చర్చింది అలానే వదిలేసిందని.. ఇపుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా తమ శాఖకు చట్టబద్దత తీసుకువచ్చే విషయంలో ఒక్కసారి కూడా క్యాబినెట్ లో సచివాలయ శాఖకు చట్టబద్దత కల్పించే అంశాన్ని చర్చించలేదన్నారు. పైగా  హోం మంత్రి వంగల పూడి అనిత సచివాలయ ఉద్యోగు విద్యార్హతలను బట్టి వారికి సముచిత స్థానాలు కల్పిస్తామని చెప్పిన తరువాతే ప్రభుత్వం కొన్ని పోస్టులు రద్దు చేసి మహిళా పోలీసులను గాల్లోనే ఉంచేశారని ఆరోపించారు. మహిళా పోలీసులు పోస్టులు ఏ క్లస్టర్ ఉన్నవారిని కలుపుతున్నారో అక్కడ పోస్టులు ఖాళీలు ఉన్నా అక్కడ వారిని నియమించకుండానే నేడు ఆఘమేఘాలపై బదిలీలు చేపడుతున్నారని అన్నారు.

 ఇలా చేయడం ద్వారా మహిళా పోలీసులు తీవ్రంగా నష్టపోతారన్నారు. ఐదేళ్లు దాటిని వారికి ట్రాన్స్ ఫర్ ఆప్షన్ ఇచ్చారు తప్పితే.. ఖాళీగా ఉన్న క్లస్టర్ సచివాలయాల్లో బదిలీలకు ప్రభుత్వం ఐదేళ్లు పూర్తవని వారికి, కొత్తగా గతేడాది బదిలీలపై వచ్చిన వారికి అవకాశం ఇవ్వలేదన్నారు.  ఏ ప్రభుత్వశాఖలోనూ గ్రామ, వార్డు సచివాలయశాఖలో ఉన్నంత మంది విద్యావంతులు లేరని.. అలాంటి తమను ప్రభుత్వ సేవలకోసం వినియోగించుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఉద్యోగం ఒక శాఖలో ఇచ్చి అన్ని ప్రభుత్వశాఖల విధులు తమతో చేయిస్తున్నా..ప్రభుత్వ ఉద్యోగంలో భవిష్యత్తు ఉందనే నమ్మకంతో చేస్తున్నామని.. కానా రాను రాను తమకు ఉద్యోగ భద్రత కరువైపోతుందన్నారు. గత ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగ వ్యతిరేక విధానాల కంటే కూటమి ప్రభుత్వం మరింత అధికంగా వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందని పేర్కొన్నారు. 

కనీసం ఉద్యోగులను సంప్రదించకుండా, ఉద్యోగులను ఏ శాఖలోని ఖాళీల్లో భర్తీచేస్తారో చెప్పకుండా రేషనలైజేషన్ పేరుతో చాలా ఉద్యోగాలను రద్దు చేసి తమను గాల్లో పెట్టిందని.. తీరా గాల్లో పెట్టిన వారిని ఎక్కడకు పంపిస్తున్నారో చెప్పకుండా మళ్లీ బదిలీలు చేస్తామని చెబుతుందని ధ్వజమెత్తారు. అన్ని ప్రభుత్వశాఖల ఉద్యోగులకు పదోన్నతులు ఇస్తున్నారని.. అదేవిధంగా అన్ని ప్రభుత్వశాఖల విధులు తాము చేస్తున్నా తమకు మాత్రం పదోన్నతులు కల్పించే విషయం మాట్లాడితే మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. యోగాలో విశాఖలో గిన్నిస్ రికార్డ్ సాధించడంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రధాన భూమివ వహించారని ప్రభుత్వానికి తమ వలన మంచి పేరు వస్తున్నా.. తమకు మాత్రం ప్రభుత్వంలో ఉద్యోగభద్రత కరువైందన్నారు. తమ ఉద్యోగులకు న్యాయం చేయకపోతే రానున్న రోజుల్లో నిరసన వివిధ రూపాల్లో తెలియజేస్తామని హెచ్చరించారు. 

ఇప్పటికే పలుమార్లు ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పించామని, ఇకపై ప్రజలు అర్జీలు సమర్పించే స్పందనలోనూ, ప్రభుత్వ అధికారుల ప్రత్యేక స్పందనలోనూ, ఎవరి సచివాలయాల్లో వారే ప్రభుత్వానికి తెలిసే విధంగా అర్జీలు సమర్పిస్తామని కూడా తెలియజేశారు. ప్రభుత్వం తమను ఎన్ని విధాలుగా వినియోగించుకున్నా తమకు అభ్యంతరం లేదని.. కాకపోతే తమకు పదోన్నతులు కల్పించి, నిర్ధిష్టమై సర్వీసు రూల్స్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సర్వీస్ నిబంధనలు లేకపోతే ఎంతకాలమైనా తాము ఈ ఉద్యోగాల్లో మగ్గిపోవాల్సి వుంటుందని.. గత ప్రభుత్వం చేసిన తప్పులనే కూటమి ప్రభుత్వం అమలు చేస్తూ తీవ్ర తాత్సారం చేస్తుందని ఆరోపించారు.

 ఉయ్ వాంట్ జస్టిస్, ప్రమోషన్ ఫస్ట్- ట్రాన్స్ ఫర్ నెక్స్ట్, నోషనల్ ఇంక్రిమెంట్లు విడుదల చేయాలి, 9నెలల అరియర్సు విఢుదల చేయాలవంటి, వార్డు టు వార్డు మాత్రమే బదిలీలు చేయాలి, ఖాళీల భర్తీ వెంటనే చేపట్టాలి, ఇతర శాఖల అధికారుల ఆదిపత్యాన్ని తగ్గించాలి, అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జీవిఎంసీ పరిధిలోని అన్ని వార్డు సచివాలయాల నుంచి పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొన్నారు.