మేడి పండు చూడ మేలిమై ఉండును.. పొట్ట విప్పిచూడ పురుగులుండు.. అన్న సామెత సిటీ ఆఫ్ డెస్టినీగా విశాఖపట్నానికి సరిగ్గా సరిపోతుంది. అందమైన విశాఖ నగరరం పైకి సుందరంగానూ.. లోన కాలుష్యంతో నిండిపోయింది. విశాఖ పోర్టు ద్వారా వాయు కాలుష్యం..జీవిఎంసీ డ్రైనేజీల ద్వారా నీటి కాలుష్యం.. ఆ మురుగు నీరు సముద్రంలో కలవడం ద్వారా సముద్ర కాలుష్యం.. డ్రైనేజీలకు ఆనుకొని వున్న మంచి నీటి పైపుల్లోకి చేరుతున్న మురునీటితో మంచినీరు కలుషితం.. వేళా పాలా లేకుండా అర్ధరాత్రి సమయంలో అత్యధిక శబ్దాలతో మోగిస్తున్న డీజే సౌండ్లతో ధ్వని కాలుష్యంతో మహా విశాఖ నగరం అన్నింటా కలుషితం అవుతోంది. కాలుష్యం నుంచి విశాఖను కాపాడేస్తున్నామనే పాలకుల మాటలుకి విశాఖ నగరంలో రోజు రోజుకి పెరుగుతున్న శ్వాస కోస వ్యాధుల బాధితులే సాక్ష్యాలుగా నిలుస్తున్నారు. విశాఖలో ఇపుడు శ్వాస కోస వ్యాధుల ఆసుపత్రులు ప్రాంతానికి ఒకటి పుట్టుకొస్తున్నాయి. అంటే విశాఖ కాలుష్యం పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
పోర్టు కాలుష్యాం బయటకు రాకుండా నిలువెత్తు కాంపౌండ్ గోడలు కట్టినా.. పోర్టుకి ఎదురుగా ఉన్న ఎస్సార్ కంపెనీ నుంచి వచ్చే దుమ్మూ, దూళీ, కన్వేయర్ బెల్టు ద్వారా వచ్చే నల్లభూడిలు వన్ టౌన్ ఏరియాని సందర్శిస్తే ఆ ప్రాంతంల పూర్తిగా మారిన రంగును బట్టే చెప్పొచ్చు కాలుష్యం ఏ స్థాయిలో వుంటుందో.. నల్లబూడిత బాధను తట్టుకోలేక పోర్టు ఏరియా, వన్ టౌన్ ఏరియా వాసులు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిపోతున్నారంటే అతిశయోక్తి కాదు. నిత్యం ట్రాఫిక్ లో ఉద్యోగాలు చేసే ట్రాఫిక్ పోలీసులు కూడా ఈ మధ్య కాలంలో అత్యధికంగా కాలుష్యం భారిన పడుతున్నారు. విశాఖ చట్టూ ఉన్న కర్మాగారాలు వలన తెల్లవారు జామున ఒంటి గంట నుంచి ఉదయం 5గంటల ప్రాంతంలో వచ్చే రసాయానాల దుర్వాన ముక్కు పుటాలు అదిరేలా వుంటుంది. ఒక్కోసారి గుక్కతిప్పుకోలేని రసాయాల వాసవచ్చి ప్రజలు ఉక్కిరి బిక్కిరి కూడా అవుతుంటారు. ఆ సమయంలో అయితే ఎవరూ పెద్దగా బయటకు రారనే ఉద్దేశ్యంతో ఆ సమయంలోనే నగరం వెలుపల ఉన్న కర్మాగారాలన్నీ వాయువులను బయటకు వదులుతున్నాయి.
వీటిపై ఎన్ని ఫిర్యాదులు చేసినా కంపెనీలు బడాబాబులవి కావడంతో ఫిర్యాదులన్నీ బుట్టదాఖలు అవుతున్నాయి. ఎక్కడైనా సముద్రతీర ప్రాంతం వుందంటే అక్కడ మత్స్య ఉత్పత్తులు అధికంగా దొరుకుతుంటాయి. విశాఖలోని ప్రధాన ప్రాంతాల్లోని డ్రైనేజీలన్నీ బంగాళా ఖాతంలో కలవడంతో సముద్ర జలాలు కూడా కలుషితం అయి మత్స్య సంపద ఒడ్డుకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కొన్ని ప్రాంతాల్లో కర్మాగారాలు వదిలే వ్యర్ధాల కారణంగా సముద్రంలో చాలా దూరం వరకూ మత్స్యకారులకు చేపడు పడే పరిస్థితి కూడా ఉండటం లేదు. ఆ కారణంగా కొద్దిపాటి చేపల వేటకే సముద్రం మధ్యవరకూ వెళ్లాల్సి వస్తుందని చెబుతున్న గంగపుత్రుల మాటలు ఒకింద బాధను, భయాన్ని కూడా కలిగిస్తున్నాయి. విశాఖలోని వాతావరణం మిగిలిన అన్ని ప్రాంతాల కంటే భిన్నంగానే వుంటుంది. నగరం మొత్తం కాంక్రీట్ జంగిల్ గా మారిపోవుడం.. నగరం పరిధి ఎంత వరకూ ఉంటే అంతవరకూ కట్టడాలు వెలుస్తుండటంతో పచ్చని చెట్లు పెంచే ఖాళీ లేకుండా పోతున్నది.
ఉన్న కొద్తి పాటి స్థలంలో ప్రభుత్వమే పెంచిన ఏడాకుల చెట్లు నుంచి వస్తున్న తిక్క వాసన నగర వాసులను మరింత ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. ఎక్కడైనా చెట్ల వలన స్వచ్చమైన గాలి వస్తుంటే.. విశాఖనగరంలో మాత్రం గాలి రసాయానాలు, వ్యర్ధాలు, తిక్క తిక్క వాసనలతో వస్తుంటుంది. ప్రస్తుతం విశాఖనగరంలో 60శాతం మంది వాటర్ ప్యూరీ ఫైయర్స్ వినియోగిస్తున్నారు. కలుషితం అయిన నీటిని త్రాగితే ఎక్కడ రోగాలు వస్తాయోననే భయంతో.. రానున్న రోజుల్లో పెరిగిపోతున్న కాలుష్యం కారణంగా ఎయిర్ ప్యూరీ ఫైయర్ లు కూడా కొనుక్కునే పరిస్థితికి విశాఖ మహా నగరం వచ్చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతీ ఏటా పర్యావరణ పరిరక్షణ దినోత్సం రోజున ప్రచార అర్భాటాల కోసం ఫోటోలకి ఫోజులిచ్చే సంస్థలు ఎంత మేర పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నాయనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ ఆలోచించాల్సి వుంది.
విశాఖ పోర్టు ట్రస్టు ఎంత గోడ పరదాలు కప్పినా కాలుష్యం అంతకంతకూ పెరుగున్నది తప్పితే తరగడం లేదు. భీమిలీ నుంచి కాకినాడ వరకూ సముద్రతీర ప్రాంతంలోని ఎన్ని కర్మాగారాలు వాటి వ్యర్ధాలను సముద్రంలోకి మోతాదుకి మించి వదులుతున్నాయనే పరిశీలన చేసి వాటిని నియంత్రించలేకపోతేమాత్రం రానున్న తరలాకు మత్స్యసంపద అందని ద్రాక్షగా తయారైనా ఆశ్చర్యపోవాల్సి పనిలేదు. సిటీ ఆఫ్ డెస్టినీ అంటే నగరాన్ని అందగా ఉంచడమే కాదు.. కాలుష్యం భారి నుంచి కాపాడి స్వచ్ఛమైన నగరంగా తీర్చి దిద్దే బాధ్యత ప్రభుత్వంతోపాటు ప్రజలపై కూడు ఉందనే విషయన్ని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలి..?!