ఆనం కళాకేంద్రం సందర్శించిన కమిషనర్..


Ens Balu
8
Rajahmundry
2022-04-08 13:04:12

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ గా భాద్యతలు చేపట్టిన కె.దినేష్ కుమార్ నగర పాలక సంస్థ లోని వివిధ విభాగాలను పరిశీలించి, ఆయా విభాగాల పనితీరు పై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రం ను పరిశీలించి శనివారం ఉదయం 11 గంటలకు  ప్రారంభోత్సవం కోసం తగిన ఏర్పాట్లు చేయవలసిందిగా అధికారులను ఆదేశించారు. కోవిడ్ కారణంగా గత రెండు సంవత్సరాలుగా ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించలేదని అధికారులు తెలిపారు. కళా ,  సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికగా నిలిచి నగరంలో ఒక సాంస్కృతిక కళా వేదికగా ఆనం కళాకేంద్రంకి పునర్ వైభవాన్ని తీసుకుని రావడం జరుగుతుందని దినేష్ కుమార్ తెలిపారు. స్టేజి డెకరేషన్ , లైటింగ్, సిట్టింగ్ కెపాసిటీ వంటి వాటిపై సమీక్షించి, సూచనలు చేశారు. కమిషనర్ తో నగర పాలక సంస్థ డీఈ జి. పాండురంగారావు, ఈఈ  ఆర్.శేషగిరిరావు, డీఈ  పి. ప్రసాద్ తదితరులు హాజరయ్యారు.