ఈనాడు ఆంధ్రజ్యోతి టీవి5 లను వదిలేదు..


Ens Balu
8
Visakhapatnam
2022-04-08 15:58:01

తనపై అసత్య ప్రచారాలు చేసిన టీడీపీ నాయకులు, బండారు సత్యనారాయణ,పలువురి టిడిపి నాయకులపైన ఈనాడు,ఆంధ్రజ్యోతి  టీవీ5,మీడియా సంస్థలపై ఎంపీ విజయసాయిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఈ మేరకు ఫిర్యాదుని పిఎం పాలెం పోలిసు స్టేషన్లో  అందజేశారు. అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు హయాంలోనే ఎన్సీసీ భూముల లావాదేవీలు జరిగాయని,  ఆ విషయమై తిరుపతి వేంకటేశ్వర స్వామిపై ఒట్టు పెట్టి నిజాలు చెప్పగలరా అని ప్రశ్నించారు. కోట్లాది రూపాయలు తీసుకుని  ఎన్.సి.సి కంపెనీకి లబ్ది చేకూర్చింది చంద్రబాబు కాదా అని మండి పడ్డారు.చంద్రబాబు ఆల్జీ మర్స్ అనే వ్యాధితో బాధ పడుతున్నారని,  దేవుడు ఆయుష్హు ఇస్తే వచ్చే ఎన్నికల వరకు మాత్రమే చంద్రబాబు రాజకీయాలు చేస్తారని..కానీ వచ్చే పరిస్థితి ఏపీ ప్రజలు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్రలో బీసీల కడుపు కొట్టి భూములను టిడిపి సామాజిక వర్గం ఆక్రమించిందన్న ఆయన ఆ భూముల విలువ కనీసం 10వేల కోట్లు ఉంటుందన్నారు. భూముల అక్రమాలను సహించేది లేదని, భూములు అన్నీ స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. సుజనా చౌదరి ఆర్ధిక నేరగాడని, అయ్యన్నపాత్రుడు మోస్ట్ వాగుడుకాయని, ఆయన ఇంటి పేరు చింత కాయ కాదు మిరపకాయల అంటూ చురకలు అంటించారు. అయ్యన్న తాగితే మనిషే కాదని..రాత్రీ,పగలు తాగుతునే ఉంటాడని అన్నారు. ఆయన కొడుకు విజయ్ కి బినామీ కంపెనీలు ఉన్నాయిని, తండ్రి కోడుకులు బెంగుళూరులో మోసాలకు  పాల్పడ్డారని ఆరోపించారు. ఈ విషయమై ఈడీకి కూడా ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారు. అంతేకాకుండా అక్రమాలకు పాల్పడిన ఎమ్మెల్యే వెలగపూడి, మాజీ మంత్రి బండారు సత్యన్నారాయణ మూర్తిని వదిలి పెట్టే ప్రసక్తే లేదని క్రిమినల్ , సివిల్ డిఫార్మేషన్ కేసులు పెట్టి న్యాయస్థానంను ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. విజయసాయిరెడ్డితోపాటు ఎమ్మెల్సీ వంశీక్రిష్ణశ్రీనివాస్, ఎమ్మెల్యే అదీప్ రాజ్, తిప్పలనాగిరెడ్డి, ఉత్తర నియోజవకర్గ ఇన్చార్జి కెకె రాజు, ఐటి విభాగం ప్రతినిధి మిలీనియం శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.