నవరత్నాల పథకాలు పేదలకు చేర్చాలి..


Ens Balu
6
Guntur
2022-04-08 16:11:42

రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రతీ సంక్షేమ, అభివృద్ధి పథకాలను జిల్లాలో సమర్ధవంతంగా అమలు చేసి జిల్లా ప్రతిష్టను  పెంచాలని అన్నిశాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జూమ్ వీడియోలో జిల్లాలోని పలు శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమీషనర్లు, తహాశీల్ధార్లు, ఎమ్.పి.డి.ఒ లతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధానంగా హౌసింగ్ జగనన్న పేదలందరికీ ఇల్లు,(హౌసింగ్ కనస్ట్రక్షన్) స్పందన, వార్డు/గ్రామ సచివాలయాలు, ఓ.టి.ఎస్, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం   (లేబర్ బడ్జెట్, వై.యస్.ఆర్ జలకళ), రెవెన్యూ (రీసర్వే, సర్వే) కార్యక్రమాలు అమలు అవుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు అమలులో జరుగుతున్న జాప్యానికి గల కారణాలు తెలుసుకొని, వాటికి పరిష్కార మార్గాలపై దిశా నిర్ధేశం చేశారు. చిన్న సాంకేతిక సమస్యలను అధిగమించేందుకు అధికారులు అంతా సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఎక్కడా సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంతో పాటు, జిల్లాలో నిరంతర అభివృద్ధి జరిగేలా లక్ష్యాలను పెట్టుకొని పనిచేయాలని జిల్లా కలెక్టర్ వేణుగోపాలరెడ్డి సూచించారు. ప్రభుత్వ నిర్ధేశిత ఆర్డర్ల ప్రకారం అధికారులు పని చేయాలని సూచించారు. మండలాల వారిగా తహాశీల్ధార్లు, ఎమ్.పి.డి.ఒ లు, మున్సిపల్ కమీషనర్లు, పలువురు జిల్లా అధికారులతో పనుల పురోగతికి తీసుకోవాల్సిన చర్యలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ జి. రాజకుమారి, డి. ఆర్. ఒ చంద్రశేఖరరావు డి.ఆర్.డి.ఎ పి.డి ఆనంద్ నాయక్, డ్వామా పి.డి. యుగంధర్ కుమార్, హౌసింగ్ పి.డి. సాయి నాథ్, ఎస్సీ కార్పోరేషన్ ఇ.డి ప్రేమ కుమారి, సి.పి.ఒ శేషశ్రీ, హౌసింగ్, రెవెన్యూ, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

సిఫార్సు