ఈవీఎంల భద్రతకు పటిష్ట చర్యలు..
Ens Balu
6
Kakinada
2022-04-14 14:04:56
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం) భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఎన్నికలు, రెవెన్యూ తదితర శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉన్న ఈవీఎం, వీవీప్యాట్ గోదామును కలెక్టర్ కృతికా శుక్లా..రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈవీఎంల రక్షణ, భద్రతకు సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం మార్గనిర్దేశాల మేరకు ఎప్పటికప్పుడు ఈవీఎం, వీవీ ప్యాట్ గోదామును క్షుణ్నంగా తనిఖీ చేసి, సమగ్ర నివేదికను పంపిస్తున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా ప్రతి మూడు నెలకు ఒకసారి జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోదామును పరిశీలించడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విపత్తుల, స్పందన, అగ్నిమాపక అధికారి ఎన్ సురేంద్ర ఆనంద్, కాకినాడ ఆర్డీవో బీవీ.రమణ, కాకినాడ పట్టణ తహసీల్దార్ వైహెచ్ఎస్ సతీష్, పట్టణ, కలెక్టరేట్ ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్లు జె.రమేష్, ఎం. జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.