శ్రీ పద్మావతిని దర్శించుకున్న కేంద్ర మంత్రి..


Ens Balu
2
Tiruchanur
2021-03-13 16:24:08

కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ లు కలసి శనివారం ఉదయం తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.  శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడుతూ తిరుమల శ్రీవారి, తిరుచానూరు అమ్మవార్లను దర్షించుకోవడం నా అదృష్టం అని, ఆంధ్రరాష్ట్ర , భారత దేశప్రజలు శుభిక్షం గా ఉండాలని,   శ్రీవారి అమ్మవార్ల ఆస్సీసులతో కోవిడ్ నుండి బయటపడతామని ఆసిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర రెడ్డి,  జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్,  టిటిడి జెఇఒ  సదాభార్గవి, ఆర్డీఓ కనకనరసా రెడ్డి, ఏఈఓ మల్లీశ్వరి, తహసీల్దార్ , భాగ్యలక్ష్మి, టిటిడి అధికారులు ఆలయమర్యాదలతో  స్వాగతం పలికి అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేశారు.వీరి వెంట రైల్వే జి.ఎం.గజనన్ మాల్యా, డిఆర్ ఎం ఆలోక్ తివారి,తిరుపతి రైల్వే స్టేషన్ డైరెక్టర్ సత్యనారాయణ అధికారులు ఉన్నారు. రేణిగుంట విమానాశ్రయం బయలుదేరి వెళ్లారు.