ఇవిఎం ల భద్రత విషయంలో రాజీపడకుండా అవసరమైన అన్ని చర్యలు పకడ్బందీగా తీసుకోవాలని జిల్లా కలెక్టరు వివేక్ యాదవ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీలలో భాగంగా గుంటూరు ఆర్డీవో కార్యాలయం ఆవరణలోని ఇవియంలు భద్రపరిచిన గోడౌన్ ను, ఫిరంగిపురం మండలం రేపూడి గ్రామంలో వ్యవసాయ మార్కెట్ గోడౌన్ లో భద్రపరచిన వీవీపాట్స్ లను జిల్లా కలెక్టర్ శుక్రవారం తనిఖీ చేసారు. రాజకీయపార్టీల ప్రతినిధుల సమక్షంలో గోడౌన్లకు వేసిన సీళ్ళు తొలగించి తాళాలు తీశారు. గోడౌన్ లోపల ఉన్న ఇవియం, వివిపాట్స్ బాక్సులకు వేసిన సీల్డ్ ను జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అమరావతి– అనంతపురం ఎక్స్ప్రెస్వే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఈవీఎం, వీవీప్యాట్ గోడౌన్లు నోడల్ ఆఫీసర్ వి.శైలజ, గుంటూరు ఆర్డీవో భాస్కరరెడ్డి, గుంటూరు పశ్చిమ మండల తహశీల్దారు మోహనరావు, ఫిరంగిపురం తహశీల్దారు సాంబశివరావు, హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ సునీల్, బహుజన సమాజ్ పార్టీ సిటి ప్రెసిడెంట్ చిరతనగండ్ల వాసు, సీపీఐ పార్టీ తరుపున కె.ఈశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ తరుపున అడవి ఆంజనేయులు, ఏఐఎంఐఎం జిల్లా అధ్యక్షులు బాజిత్ బాషా, రేపూడి గ్రామం వ్యవసాయ మార్కెట్ గోడౌన్ లో భద్రపరచిన వివిపాట్స్ బాక్సుల పరిశీలనలో సిపియం నాయకులు సి. వెంకటేశ్వర్లు, టిడిపి నుండి ఎం. నరసింహారావు, బిజేపి నుండి చంద్ర శేఖర్ రావు, వైసిపి పార్టీ నుండి కే. చినపరెడ్డి, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.