సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ(సింహాద్రి అప్పన్న)స్వామి వారిని శనివారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్ దర్శించుకున్నారు. ఆమె అత్త, మావయ్య ఇతర కుటుంబ సభ్యులుసింహాద్రినాథునికి పూజలు చేశారు. అందరికీ ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం అర్చకులు , వేద పండితులు ఆశీర్వదం అందించారు. శ్రీ స్వామివారి ప్రసాదాలను అధికారులు అందించారు. మొత్తం 15 మంది కుటుంబ సభ్యులు. శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. వెంకయ్యనాయుడు కుటుంబ సభ్యులు ముందుగానే 4500 పెట్టి 15 అతిశీఘ్రదర్శనం టికెట్లు తీసుకోవడం విశేషం.