అప్పన్నకు చందనం సమర్పణ..


Ens Balu
2
Simhachalam
2021-07-03 13:12:16

సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహ(సింహాద్రి అప్పన్న)స్వామికి శనివారం గాజువాకకు చెందిన కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి, ఐశ్వర్య- అవినాష్ దంపతులు  రూ.10.116, కాకి గోవింద రెడ్డి చెరో అరకేజీ చందనం కోసం రూ.10.116  అరకేజీ చొప్పున చందనం సమర్పించారు. ట్రస్టు బోర్డు సభ్యుడు దినేష్ రాజు ఆధ్వర్యంలో చందనం సమర్పించారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ, స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన చందనం సమర్పించే అవకాశం కల్పించడం సంతోషకరమన్నారు. చందనం సమర్పించిన భక్తుల తరపున దినేష్ రాజుకి  చందనం ముక్కతోపాటు ఆలయ ఏఈఓ రాఘవ కుమార్  ప్రసాదాన్ని అందించారు.  ఈ కార్యక్రమంలో ట్రస్టుబోర్డు సభ్యుడు సూరిశెట్టి సూరిబాబు పాల్గొన్నారు.