అప్పన్నకు ICDSజెడీ శ్రీలత పూజలు..
Ens Balu
5
Simhachalam
2021-07-04 06:56:40
సింహాచలం శ్రీశ్రీశ్రీ శ్రీవరాహ లక్ష్మీ నృసింహస్వామి(సింహాద్రి అప్పన్న) వారిని మహిళా శిశు సంక్షేమశాఖ జాంట్ డైరెక్టర్, డిప్యూటీ కలెక్టర్ ఆర్.శ్రీలత తమ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆదివారం ఆలయానికి చేరుకున్నవారికి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆయన సింహాద్రి అప్పన్నకు ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆలయ అధికారులు ప్రసాదం అందజేయగా, వేద పండితులు ఆశీర్వాదం అందించారు. జెడీతోపాటు పెందుర్తి సిడిపిఓ కూడా స్వామివారిని దర్శించుకున్నారు.