అప్పన్నకు అరకేజీ చందనం సమర్పణ..


Ens Balu
3
Simhachalam
2021-07-04 07:39:23

 శ్రీశ్రీశ్రీ  శ్రీవరాహ లక్ష్మీ నృసింహస్వామి(సింహాద్రి అప్పన్న) వారికి విశాఖ బుచ్చిరాజుపాలెం గవరవీధికి చెందిన భక్తుడు మారిశెట్టి లీలాఈశ్వరరావు, సూర్యకళ దంపతులు ఆదివారం  అరకేజీ చందనం సమర్పించారు. ట్రస్టు బోర్డు సభ్యుడు సూరిశెట్టి సూరిబాబు, దినేష్ రాజు ఆధ్వర్యంలో  చందనం సమర్పించారు.  ఆలయ ఏఈఓ రాఘవ కుమార్ కు రూ. 10,116 (పదివేల నూట పదహారు)ను సమర్పించి చందనం చెక్కను ప్రసాదంగా పొందారు. అనంతరం స్వామివారిని దర్శించుకుకొని తీర్ధ ప్రసాదాలను స్వీకరించారు. స్వామివారిని దర్శించుకుని ఇక్కడే చందనం సమర్పిస్తే వెంటనే చందనం చెక్కను ప్రసాదంగా ఇస్తామని రాఘవ కుమార్ వివరించారు.