దసరా నాటికి రోడ్లు నిర్మాణాలు పూర్తికావాలి..


Ens Balu
2
Visakhapatnam
2021-07-15 15:49:23

జీవీఎంసీ, భీమిలీ రూరల్ నియోజకవర్గ అధికారులతో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సీతమ్మధారలోని  క్యాంప్ కార్యాలయం లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నగరంపాలెం, రేవులపాలెం రోడ్లను దసరా పండగకి పూర్తి చేయాలని ఆదేశించారు. భీమిలి నియోజకవర్గంలో మంచినీటి సమస్య లేకుండా.. స్వచ్ఛమైన నీరు అందించేలా చూడాలని వాటర్ వర్క్స్ అధికారులను ఆదేశించారు. కొమ్మాది, మధురవాడ ప్రాంతాల్లో ఆక్రమణలు జరుగకుండా.. ఉన్న ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు. 6వ వార్డులో పవర్ కట్ లేకుండా చూడాలని అన్నారు. జీవీఎంసీకి సంబంధించి హార్టికల్చర్, పార్క్స్, ప్లాంటేషన్ పై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. పార్క్ సైట్స్ ఆక్రమణలకు గురి కాకుండా బయో ఫెన్సింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో జీవీఎంసీ చీఫ్ విప్, 6వ వార్డు కార్పొరేటర్ ముత్తంశెట్టి ప్రియాంక,  ఇంజనీరింగ్ ఎస్ఈలు సామ్ సన్, రవి, రాజారామ్, భీమిలీ నియోజకవర్గ ఉడా ఎస్ఈ రామ్ మోహన్.. ఇతర అధికారులు పాల్గొన్నారు.