20 వరకే ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలు..


Ens Balu
2
Srikakulam
2021-07-15 16:19:16

శ్రీకాకుళం జిల్లాలో రబీ సీజనులో రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం నిర్ణయించిన మద్ధతు ధరకు కొనుగోలు చేసేందుకు ఈ నెల 20 వరకే ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలు తెరచిఉంటాయని సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్ స్పష్టం చేసారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన జారీచేసారు. రబీలో పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ మద్ధతు ధరకు కొనుగోలు చేసేందుకు గాను జిల్లాలో 57 ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలను ఏర్పాటుచేయడం జరిగిందని జె.సి తెలిపారు. 2020 – 21 రబీలో పండించిన ధాన్యాన్ని రైతులు విక్రయించేందుకు వీలుగా         మే నెల 18న కొనుగోళ్ల కేంద్రాలను ప్రారంభించామని, నాటి నుండి రైతుల నుండి కొనుగోళ్లు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ కొనుగోలు కేంద్రాలు ఈ నెల 20 వరకు తెరచి ఉంటాయని, కావున  రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని తమ సమీప కొనుగోలు కేంద్రం లేదా రైతు భరోసా కేంద్రానికి తీసుకువెళ్లి విక్రయించుకోవలసినదిగా ఆయన కోరారు.  జూలై 20లోగా రైతులు ఎవరూ ధాన్యం విక్రయించేందుకు ముందుకు రాకపోతే రైతుల వద్ద ధాన్యం నిల్వలు లేనట్లుగా భావించి కొనుగోలు కేంద్రాలను మూసివేయడం జరుగుతుందని వివరించారు.  కావున  జిల్లాలోని రైతులు ప్రభుత్వం కల్పించిన ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ వద్ద ఉన్న ధాన్యాన్ని ఈ నెల 20లోగా విక్రయించి గిట్టుబాటు ధరను పొందాలని జె.సి ఆకాంక్షించారు.