అవార్డు వరించడం హర్షదాయకం..


Ens Balu
3
Kakinada
2021-07-15 16:29:56

గాంధేయవాది, స్వాతంత్ర సమరయోధురాలు, సంఘ సంస్కర్త ,అభ్యుదయవాది పద్మ విభూషణ్ డాక్టర్ దుర్గ భాయ్ దేశ్ ముఖ్ జయంతి సందర్భంగా ఆమె పేరిట ఏర్పాటు చేసిన అవార్డును ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపకురాలు ఏచూరి కల్పకం న్యూఢిల్లీ వారికి ఇవ్వడం అభినందనీయమని జాయింట్ కలెక్టర్ వెల్ఫేర్ జి. రాజకుమారి పేర్కొన్నారు.   గురువారం కాకినాడ గాంధీ నగర్ పార్క్ లోని గ్రంథాలయంలో వర్చువల్ విధానంలో అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ కాకి నాడ విభాగం వారు నిర్వహించారు. వర్చువల్ కాన్ఫరెన్స్ లో కల్పకం వారితో పాటు ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫెరెన్స్ అధ్యక్షురాలు  షీలా ఖక్కడె, ఉపాధ్యక్షురాలు చంద్రప్రభ జోష్ పాల్గొన్నారు.
   ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా విచ్చేసిన జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ గాంధీజీ ఆశయాల కోసం పనిచేసిన దుర్గ భాయ్  దేశ్ ముఖ్ కాకినాడ చెందిన వారు కావడం ఆమె ప్రోద్బలంతో మొదటిసారిగా కాకినాడలో ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ కీలకంగా వ్యవహరించి వ్యవస్థాపక అధ్యక్షురాలు గా పనిచేస్తున్న కల్పకం వారికి  ఇస్తున్న అవార్డు ఆమె  సేవా స్ఫూర్తికి నిదర్శనంగా అభివర్ణించారు.
 మహిళ స్వావలంబనకు పని చేస్తూ నిరంతరం సౌర పునరుత్పాదక శక్తి పరిశోధనలు చేయడంతోపాటు సామాజిక సేవలో తమ సేవలను అందిస్తున్న కల్పకం సేవలను జెసి రాజకుమారి కొనియాడారు. ఈ సందర్భంగా వర్చువల్ విధానములో జెసి రాజకుమారి కల్పకం కు ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత ఏచూరి కల్పకం  తనను ఎంతో అభిమానిస్తూ దుర్గాభాయి దేశముఖ్ అవార్డును ప్రధానం చేయడం పట్ల ఆల్ ఇండియా ఉమెన్స్ కాకినాడ విభాగానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ కాకినాడ విభాగం అధ్యక్షురాలు పలువురు సభ్యులు పాల్గొన్నారు.