వైఎస్సార్ భీమా పథకం 95% నమోదు..


Ens Balu
2
Kakinada
2021-07-16 15:46:51

వైఎస్సార్ భీమా పథకానికి సంబంధించి 99.25 శాతం రైస్ కార్డ్ హోల్డర్ లను నమోదు చేయడం జరిగిందని జాయింట్ కలెక్టర్ (ఆసరా&సంక్షేమం) జి.రాజకుమారి తెలిపారు.  శుక్రవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో వైయస్సార్ బీమా పథకానికి సంబంధించి అమలాపుర, రామచంద్రాపురం, పెద్దాపురం ,కాకినాడ డివిజన్ ల గ్రామ వార్డు వెల్ఫేర్ అసిస్టెంట్ లకు వైయస్సార్ బీమా క్లయిమ్ ఏవిధంగా చేయాలి దాని పై శిక్షణ కార్యక్రమాన్ని జూమ్  కాన్ఫరెన్స్ ద్వారా జేసీ రాజకుమారి సంబంధిత అధికారులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ వై.ఎస్.ఆర్. బీమా పధకాని రాష్ట్ర ప్రభుత్వము అత్యంత ప్రతిష్టాత్మకంగాజూలై 1వ తేదీ న  ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ పధకంలో సహజ మరణం పొందితే రూ.100000/-లు ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.500000/- లు , పూర్తి అంగవైకల్యం కలిగితే రూ.500000/- మరియు పాక్షిక అంగవైకల్యం కలిగితే రూ.2,50,000/- లు
నేరుగా నామినీ ఖాతాలకు జమచేయడం జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో వై.ఎస్.ఆర్.బీమా పధకంలో 16,53,364 మంది రైస్ కార్డ్ హోల్టర్స్ నమోదు చేయవలసియుండగా ఇప్పటి వరకు 99.25 శాతం నమోదు చేయడం జరిగిందన్నారు . ఈ పధకంలో నమోదు అయిన వారు ఎవరైనా మరణిస్తే వారి క్లైమ్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి, తక్షణ సహాయం (మట్టిఖర్చులు) రూ.10000/- లు  చెల్లించే విధానం పై  పలు అంశాలు ఈ సందర్భంగా వివరించారు.ఈ నేల 17న  రాజమహేంద్రవరం , గిరిజన ప్రాంతంలో ఉన్న 11 మండలంలో ఉన్న WEA &WDWS వారికి ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జేసీ జి.రాజకుమారి గారు తెలియజేసారు. ఈ జూమ్ కాన్పిరెన్స్ లో ప్రాజెక్టు డైరెక్టర్  వై.హరిహరనాథ్, అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ కె.శ్రీనివాసకుమార్, వై.ఎస్.ఆర్.బీమా ఇన్సూరెన్స్ విభాగం ఎస్.వేదకుమారి ఏపియం, డి.ఆర్.పి ఐ.టి పర్సన్స్ , నాలుగు డివిజన్ల గ్రామ వార్డు వెల్ఫేర్ అసిస్టెంట్ లు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.