అప్పన్నకు పోలీసులు ప్రత్యేక పూజలు..


Ens Balu
3
సింహాచలం
2021-07-18 14:56:06

సింహాచలంలోని శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారిని 1991వ బ్యాచ్ కు చెందిన పోలీసు అధికారుల బృందం అదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసింది. మొత్తం 25 మంది ఏసీపీలు, డీఎస్పీలు, సీఐలు స్వామిని దర్శించుకున్నావారిలో ఉన్నారు. 1991లో ఏపీ పోలీస్ అకాడమీలో శిక్షణపొందారు. ప్రతిఏటా ఒకరోజు ఏదో ఒక చోట ఈ అధికారులంతా  కలుస్తుంటారు. అయితే అనూహ్యంగా ఈ స్వామివారి దివ్య సన్నిధిలో కలిసే భాగ్యం దక్కిందని వారు ఆనందం వ్యక్తం చేశారు. తమకు మంచి దర్శనం ఏర్పాటుచేసిన దేవస్థానం ఈఓ సూర్యకళకు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.  స్వామివారిని దర్శించేటప్పుడు అందరూ సంప్రదాయ డ్రెస్ కోడ్ పాటించారు. శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి ఆశీస్సులతో విధులు సమర్ధవంతంగా నిర్వర్తిస్తున్నామని చెప్పారు.  దర్శనం అనంతరం సింహగిరులపైనే కాసేపు గడిపారు పోలీసు అధికారులంతా..వీరిలో గోపాలపట్నం ట్రాఫిక్ సీఐ శ్రీహరి రాజు కూడా ఉన్నారు.