సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారి వారికి 4వ విడత చందనం సమర్పించడానికి అరగత కార్యక్రమంలో భాగంగా తొలి ఈరోజు 27 కిలోల చందనాన్ని అరగదీశారని ఈఓ ఎంవీ సూర్యకళ తెలియజేశారు. ఈమేరకు ఆమె మీడియాకి ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 24వ తేదీన స్వామివారికి తుదివిడత చందన సమర్పణ జరుతుందని అందులో పేర్కొన్నారు. నేటి నుంచి చందనం అరగదీత నాలుగైదు రోజులపాటు కొనసాగనుంది. స్వామివారికి భక్తులు చందనాన్ని సమర్పించడానికి ట్రస్టు సభ్యులు లేదా ప్రత్యేక ఆహ్వానితులు, దేవస్థాన అధికారులను సంప్రదించవచ్చునని దేవస్థాన అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పలువురు భక్తులు స్వామివారికి చందనాన్ని సమర్పించారు. స్వామివారికి చందనం సమర్పించే అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని దేవస్థాన ఈఓ ఆ ప్రకటనలో కోరుతున్నారు.