శ్రీకాకుళం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పాలకవర్గం గురువారం ప్రమాణ స్వీకారం చేస్తుందని డిసిసిబి ముఖ్య కార్యనిర్వహణ అధికారి డి. సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన జారీ చేస్తూ గురువారం ఉదయం 10.30 గంటలకు డిసిసిబి చైర్పర్సన్ గా కరిమి రాజేశ్వరరావు, సభ్యులుగా బంకి లక్ష్మణ మూర్తి, గొండు నిర్మల, బొడ్డేపల్లి నారాయణరావు, దండాసి ఎండమ్మ, మియాబిల్లీ శ్యామ సుందరరావు, నడిమింటి రామమూర్తి పదవి బాధ్యతలు స్వీకరిస్తారని ఆయన పేర్కొన్నారు.