ఈరోజు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు385..


Ens Balu
1
Kakinada
2021-07-25 15:47:21

తూర్పుగోదావరి జిల్లాలో ఈరోజు కొత్తగా 385 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని ఇన్చార్జి కలెక్టర్ లక్ష్మీశ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆదివారం కరోనా బులిటిన్ మీడియాకి ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం 309 మంది హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారని, జిల్లావ్యాప్తంగా 225 మందికి వేక్సిన్ వేసినట్టు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 1085 బెడ్లు వివిధ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నాయని ప్రకటించారు. ఈరోజు 481 మంది కోవిడ్ రోగులు పూర్తిగా కోలుకొని డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకూ జిల్లాలో 15లక్షల 5502 మందికి కోవిడ్ వేక్సినేషన్ జరిపినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.