5 ఏఎస్ఐల సస్పెన్సన్.. ఒకరు తొలగింపు


Ens Balu
0
Kakinada
2021-07-25 16:14:33

తూర్పుగోదావరి జిల్లా ఐదుగురు పోలీసులను డిఐజీ కెవి.మోహనరావు సస్పెండ్ చేసినట్టు ఎస్పీ ఎం.రవీంధ్రబాబు ఒక ప్రకటనలో  ఆదివారం  తెలియజేశారు. చింతూరు, రామచంద్రాపురం, అనపర్తి సబ్ డివిజన్లలో పనిచేస్తున్న ఐదుగరు పోలీసు అధికారులను సస్పెండ్ చేయగా. ఒక ఏఎస్ఐని విధుల నుంచి తొలగించినట్టు పేర్కొన్నారు. సస్పెండ్ అయినవారంతా ఏఎస్ఐలే కావడం విశేషం. కాగా పలు అవినీతి ఆరోపణలు ఎదర్కొంటున్న వారిపై స్వయంగా ఎస్పీ విచారణ నిర్వహించి డిఐజీకి అందజేశారు. దీనితో వాస్తవాలు వెలుగు చూడటంతో వారిపై చర్యలు తీసుకున్నారు.