సింహాద్రి అప్పన్నకు కాటా విరాళం..


Ens Balu
3
Simhachalam
2021-07-28 13:53:55

 శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మి నృసింహస్వామి(అప్పన్న)వారి క్రిస్టల్ ఇండస్ట్రీస్ అధినేత గ్రంధి సతీష్  200 కేజీల కాటాను అన్నదాన సత్రం కు ట్రస్ట్ బోర్డ్ మెంబెర్ కెవి నాగేశ్వరరావు ద్వారా విరాళంగా అందజేశారు. బుధవారం ఈ మేరకు కాటాను దేవస్థానం అధికారులకు అందించారు. తొలిపూజ చేసి కాటాను ప్రారంభించారు. అనంతరం దాతలు స్వామివారి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆలయ అధికారులు దాతలకు తీర్ధ ప్రసాదాలు అందించగా, వేదపండితులు ఆశీర్వచనాలు అందజేశారు. కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.