ప్రకృతిని మనమే పరిరక్షించు కోవాలి..


Ens Balu
3
Srikakulam
2021-07-28 15:22:00

ప్రకృతిని పరిరక్షించుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆర్.శ్రీరాములు నాయుడు అన్నారు. ప్రపంచ ప్రక్రుతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా శాంతి నగర్ క్రీడా సముదాయం ఆవరణలో బుధ వారం మొక్కలు నాటారు. ఈ సందర్భగా శ్రీరాములు నాయుడు మాట్లాడుతూ ప్రకృతినీ పరిరక్షించితే అది మనలను రక్షిస్తుందని అన్నారు. ప్రకృతిని వినాశనం చేస్తే మానవుడు వినాశనాన్ని కోరుకుంటున్నట్లు భావించాలని పేర్కొన్నారు. వాతావరణ మార్పులు ప్రకృతి వినాశనం మూలంగా జరుగుతుందనీ ప్రతి ఒక్కరూ గ్రహించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సెట్ శ్రీ సి.ఇ.ఓ కే. సూర్య ప్రభాకర రావు, చీఫ్ కోచ్ బి. శ్రీనివాస కుమార్, కోచ్ లు శ్రీధర్, బాలమురళి, పర్యాటక అధికారి నారాయణ రావు తదితరులు పాల్గొన్నారు.