యాంత్రీకరణతో వరినాట్లు వేసిన మంత్రి..


Ens Balu
4
Srikakulam
2021-07-28 15:26:23

యాంత్రీకరణతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ వరి నాట్లు వేశారు. బుధవారం మబగాంలో ఏర్పాటు చేసిన యాంత్రీకరణ ప్రదర్శనను ఆయన పరిశీలించారు. ఆయనతో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ ఉన్నారు. తుంపర్ల సేద్యంతో పంటకు రక్షణ, డ్రమ్ సీడర్ తో వరి విత్తనాలు వేయు పద్దతి, వరుసలో వరి నాట్లు వేయు పద్ధతులను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో  డిసిసిబి ఛైర్మన్ కరిమి రాజేశ్వరరావు, వ్యవసాయ శాఖ జెడి శ్రీధర్, ఆత్మ పిడి కృష్ణారావు, రాగోలు వ్యవసాయ క్షేత్రం , నైరా కళాశాల శాస్త్రవేత్తలు, తదితరులు పాల్గొన్నారు.