అప్పన్నకు రూ.1,00,116 విరాళం..


Ens Balu
4
Simhachalam
2021-07-31 17:21:53

సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ(అప్పన్న) స్వామివారికి  మధురవాడకు చెందిన  బండారు వెంకట రమణమ్మ లక్షా నూట పదహారు రూపాయలు ( రూ.1,00,116) విరాళమిచ్చారు. తన భర్త వర్ధంతి రోజైన సెప్టెంబర్16న స్వామివారి సన్నిధిలో అన్నదానం చేయాలని కోరారు. అనంతరం వారికి దేవస్థాన అధికారులు స్వామివారి దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా స్వామికి పూజలు చేసిన దాతలు కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. దేవస్థాన సిబ్బంది ప్రసాదాలు అందజేయగా, అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. 
సిఫార్సు