స్పంద‌న‌ ను స‌ద్వినియోగం చేసుకోవాలి..


Ens Balu
2
Kakinada
2021-08-01 13:49:27

రాష్ట్ర ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా ఈ నెల 2వ తేదీన సోమ‌వారం క‌లెక్ట‌రేట్‌లో ప్రజా ఫిర్యాదులు పరిష్కార వేదిక స్పంద‌న కార్య‌క్ర‌మాన్ని  నిర్వ‌హించ‌నున్న‌ట్లు క‌లెక్ట‌ర్ సి.హ‌రికిర‌ణ్ తెలిపారు. ఈ మేర‌కు ఆదివారం ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. క‌లెక్ట‌రేట్‌లోని స్పంద‌న హాల్‌లో ఉద‌యం 9 గంట‌ల‌ నుంచి నిర్వహించే జిల్లాస్థాయి స్పంద‌న కార్య‌క్ర‌మాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఆయన సూచించారు. స్పంద‌న కార్య‌క్ర‌మంలో ప్ర‌జ‌ల నుంచి అర్జీల‌ను క‌లెక్ట‌ర్, జిల్లాస్థాయి ఉన్న‌తాధికారులు నేరుగా స్వీకరిస్తారని, సదరు అర్జీల సత్వర ప‌రిష్కారానికి తక్షణ చ‌ర్య‌లు తీసుకోవడం జరుగుతుందని క‌లెక్ట‌ర్ వివ‌రించారు.
సిఫార్సు