12వ స్థానంతో సరిపెట్టుకున్న తూ.గో.జీ


Ens Balu
4
Kakinada
2021-08-01 15:53:06

వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీలో తూర్పుగోదావరి జిల్లా రాష్ట్రంలో 12వ స్థానానికి పడిపోయింది. రాష్ట్రంలో మొదటి స్థానాన్ని విజయనగరం జిల్లా కైవసం చేసుకోగా..గుంటూరు 13వ స్థానంలో నిలిచింది. మొదటి ఐదు స్థానాల్లో విజయనగరం, పశ్చిమగోదావరి, వైఎస్సార్ కడప, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాలు నిలిచాయి. గతంలో ఓసారి పోటీపడిన తూర్పుగోదావరి జిల్లా ఎందుకనో తరువాత ఆ దిశగా ప్రయత్నం చేయలేదు. వాస్తవానికి రాష్ట్రంలో అత్యధిక రెండవస్థాయి అధిక మండలాలున్న జిల్లాయే అయినా పెన్షన్ పంపిణీలో మాత్రం వెనుబడిపోయి కేవలం 72.33 మందికి మాత్రమే పెన్షన్లు పంపిణీ చేయగలిగారు. అయితే కరోనా పాజిటివ్ కేసులు అధికంగా ఈ జిల్లాలోనే నమోదు కావడం కూడా ఈ వెనుకబాటుకు మరోకారణంగా చెప్పవచ్చు.