ఐరన్, పోలిక్ ఆమ్లం, విటమ్ బి12 పుష్కలముగా లభించే పోర్టిపైడ్ బియ్యంతో చిన్నారులకు పరిపూర్ణ అరోగ్యం లభిస్తుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ బియ్యం వాడడం వలన రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరిగి రక్త హీనతను అరికట్టడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. సోమవారం కలెక్టరేట్ లో పోర్టిపైడ్ బియ్యంపై ప్రజలకు అవగాహన కలిగేందుకు కరపత్రాలను పంపిణీ చేసి బియ్యాన్ని గ్రీవెన్సు వద్ద ప్రదర్శించారు. ఈ పోర్టిపైడ్ బియ్యంతో మెదడు, నాడిమండలం పనిచేయుటలో, ఎర్రరక్త కణాలు ఉత్పత్తి సక్రమంగా జరుగుతుందన్నారు. గర్బిణీలు తినడం వల్ల గర్బిస్థ శిశువు ఆరోగ్యంగా పెరుగుతుందన్నారు. ఇవి సాధారణ బియ్యమేనని, వీటికి పోషకాలు జత చేయడం జరిగిందని, అపోహలు వీడి అందరు వినియోగించాలని కోరారు. ఈ విషయంలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, గ్రామవాలంటీర్ల ద్వారా ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు.