అప్పన్న హుండీ ఆదాయం రూ.1.03 కోట్లు..


Ens Balu
2
సింహాచలం
2021-08-04 14:02:14

విశాఖలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచల శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ(సింహాద్రి అప్పన్న)స్వామివారి హుండీ ఆదాయం ఒక కోటి మూడు లక్షల 35వేల 857 రూపాయలు వచ్చిందని ఈఓ ఎంవీ సూర్యకళ తెలియజేశారు. భారత దేశ కరెన్సీతోపాటు ఆరు దేశాలకు సంబంధించిన కరెన్సీ కూడా స్వామివారి హుండీ లెక్కింపులో లభ్యమైందని ఈఓ తెలియజేశారు. ట్రస్టుబోర్టు సభ్యులు, ట్రస్టు ప్రత్యేక ఆహ్వానితులు గంట్ల శ్రీనుబాబు, ఇతర సభ్యులు, దేవస్థాన సిబ్బంది ఆధ్వర్యంలో పరకామణి లెక్కింపు కార్యక్రమం చేపట్టిన్టు చెప్పారు. దీనికోసం ప్రభుత్వం విధించిన కోవిడ్ నిబంధనలను అమలు చేసినట్టు చెప్పారు.