సింహాచలం శ్రీశ్రీ శ్రీ వరహా లక్ష్మీనృసింహస్వామి(సింహాద్రి అప్పన్న) వారిని ప్రభుత్వ అదనపు కార్యదర్శి సంజీవ్ కౌశిక్ శుక్రవారం దర్శించుకున్నారు.ఆయనకు ఆలయ అధికారులు స్వామివారికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆయన అప్పన్నకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆలయ వైభవాన్ని ఆయనకు తెలియజేశారు. వేదపండితులు ఆశ్వీర్వాదాలు అందించగా, సిబ్బంది స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఆయన వెంట యూనియన్ బ్యాంక్ ఎఫ్జీఎం కెఎస్డిఎస్వీ ప్రసాద్, జోనల్ మేనేజర్ గుణనంద్ గని, సిజిఎం ఎస్.కె.జాన్వర్, నాబార్డు డిడిఎం శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.