మహిళాపోలీసుల రెగ్యులైజేషన్ పై ఎప్పీలకు డిజిపీ సూచనలు..


Ens Balu
7
Kakinada
2021-08-06 09:09:04

తూర్పుగోదావరి జిల్లా పోలీస్ కార్యాలయంలో  “మహిళా పోలీసుల నియామక ప్రక్రియ మరియు ఉద్యోగ నియమావళి”  పై ఆంధ్రప్రదేశ్  డిజిపి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో శుక్రవారం తూర్పుగోదావరి  జిల్లా నుంచి ఎస్పీ రవీంద్రనాథ్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర డీజీపీ  గౌతమ్ సవాంగ్  “మహిళా పోలీసుల నియామక ప్రక్రియ మరియు ఉద్యోగ నియమావళి” పై ఎస్పీలకు పలు సూచనలు చేశారు. మహిళా పోలీసుల నియామక ప్రక్రియ, దేహధారుడ్య పరీక్షా, శారీరక ప్రమాణాలు, శిక్షణ, జీత భత్యాలు, యూనిఫాం, ప్రోబేషన్ డిక్లరేషన్, ప్రమోషన్ మొదలగు సర్వీసు అంశాలపై రాష్ట్ర పోలీసు ఉన్నత అధికారులు  జిల్లా ఎస్పీ లతో చర్చించారు.  ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, డిజిపి ఆదేశాల మేరకు మహిళా పోలీసులకు సంబంధించిన కార్యక్రమాలను చేపట్టనున్నట్టు స్థానిక మీడియాకి వివరించారు.ఈ కార్యక్రమంలో లా అండర్ ఆర్డర్ అదనపు డిజిపి  రవిశంకర్ అయ్యనార్, డిఐజీ టెక్నికల్ సర్వీసెస్  పాల్ రాజు, దిశ స్టేట్ నోడల్ అధికారి రాజకుమారి పలువురు పోలీసు ప్రధాన కార్యాలయ ఉన్నత అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్సులో హాజరయ్యారు.