విశాఖ లోని వివిధ వ్యాపార సంస్థలకు చెందిన వారికి శ్రోతలతో కాంటెస్ట్ నిర్వహించి వచ్చిన ఓట్ల ఆధారంగా రేడియో సిటీ ఐకాన్ అవార్డును నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అందించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ త్వరలో పరిపాలనా రాజధాని కాబోతున్న విశాఖను, అభివృద్ధి చేయడంలో మీరంతా తోడ్పాటు అందించాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన లో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యాపార సంస్థల ప్రతినిధులు మేయర్ ఆలోచనలకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రేడియో సిటీ ఆర్.జె. బాలు కుటుంబం మరియు సిబ్బంది పాల్గొన్నారు.