అదనపు కమిషనర్ రామచంద్ర మోహన్ సస్పెన్షన్..
Ens Balu
2
Simhachalam
2021-08-06 16:30:17
విశాఖలోని సింహాచలం, మాన్సాస్ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై దేవదాయ ధర్మాదాయ శాఖ అదనపు కమిషనర్ కే. రామచంద్ర మోహన్ ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.ఈ భూములకు సంబంధించి దేవదాయ ధర్మాదాయ శాఖ విశాఖపట్నం ఉపకమిషనర్ ఈ.వి.పుష్పవర్ధన్ సభ్యులుగా ఉన్న త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక ఆధారంగా రామచంద్ర మోహన్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఇదివరలోనే ఆయనను దేవదాయ శాఖ ప్రభుత్వానికి సరెండర్ చేసిన సంగతి తెలిసిందే.ఈ భూములు. కాపాడ్డంలో భాద్యతలు సక్రమంగా నిర్వర్తించని ఇప్పటి సింహాచలం దేవస్థానం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అప్పటి జిల్లా సహాయ కమీషనర్ ఎన్. సుజాత ను సస్పెండ్ చేస్తూ దేవదాయ శాఖ ముఖ్యకార్యదర్శి జి.వాణి మోహన్ ఆదేశాలు జరీచేసారు. ప్రస్తుతం ఈ ఉత్తర్వులు దేవాదాయశాఖలో ప్రకంపనలు స్రుష్టిస్తున్నాయి.