మంత్రి అవంతి ని కలిసిన జిసిసి చైర్మన్..
Ens Balu
4
Visakhapatnam
2021-08-18 16:33:10
రాష్ట్ర పర్యాటక యువజన సర్వీసులు క్రీడల శాఖ మంత్రి ముత్తంశెట్టిశ్రీనివాసరావును జిసిసి చైర్మన్ శోభాస్వాతిరాణి ,గుల్లిపల్లి గణేష్ దంపతులు బుధవారం సీతమ్మధారలో ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా 21వ తేదీన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జిసిసి రాష్ట్రంలోనే మంచి కార్పోరేషన్ గా తీర్చిదిద్దాలని, తద్వారా గిరిజనులకు మంచి ఉపాది అవకాశాలు లభించాలని అన్నారు. జిసిసి ఉత్పత్తులకు మంచి మార్కెటింగ్ తోపాటు, అరకు కాఫీకి మరింత డిమాండ్ తీసుకురావాలని సూచించారు. రాష్ట్రప్రభుత్వం మహిళల పక్షపాతికావడంతోనే అత్యధిక కార్పోరేషన్ పదవులు మహిళలకు దక్కాయని అన్నారు. జిసిసికి అంతర్జాతీయ ఖ్యాతి వచ్చేలా శ్రమించాలన్నారు.