తుపానుపై అప్రమత్తంగా ఉండండి..


Ens Balu
3
Kakinada
2021-08-20 09:23:24

బంగళాఖాతంలో శుక్రవారం ఏర్పడిన అల్పపీడనం రానున్న 48 గంటల కాలంలో తుఫానుగా బలపడే అవకాశం వుందని వాతావరణ హెచ్చరించింది. ఈ నేపధ్యంలో విపత్తు నియంత్రణ, సహయక యంత్రాంగాన్ని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ అప్రమత్తం చేశారు.  అల్పపీడన ప్రభావంతో ఈ నెల 19 నుండి 22వ తేదీ వరకూ గంటకు 45 నుండి 60 కిమీ వేగంతో తూర్పు తీరంలో ఈదురు గాలులు, భారీ వర్షాలు కురుస్తాయని వాతవారణ కేంద్రం తెలియజేసిందని.. దీని  దృష్ట్యా మత్సకారులెవరూ సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరిక జారీచేశారు.  జిల్లా కేంద్రంతో పాటు, డివిజన్, మండల కేంద్రాలలో  రక్షణ, సహాయక శాఖల సమన్వయతో 24x7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలంటూ ఆదేశాలు జారీచేశారు. కంట్రోల్ రూమ్ నెంబర్లు – కలెక్టరేట్, కాకినాడ –18004253077, సబ్ కలెక్టరు ఆఫీసు, రాజమహేంద్రవరం – 08832442344, సబ్ కలెక్టర్ ఆఫీసు, ఎటపాక – 08748285279, పిఓ, ఐటిడిఏ ఆఫీసు, రంపచోడవరం –18004252123, ఆర్డిఓ ఆఫీసు, అమలాపురం – 08856233100, ఆర్డిఓ ఆఫీసు, కాకినాడ -08842368100,  ఆర్డిఓ ఆఫీసు, రామచంద్రపురం –08857245166.