అప్పన్నకు జివిఎంసీ కమిషనర్ పూజలు..
Ens Balu
3
Visakhapatnam
2021-08-20 11:43:46
సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ(సింహాద్రి అప్పన్న)స్వామిని వలక్షవ్రతం సందర్భంగా శుక్రవారం మహావిశాఖ నగరపాలక సంస్థ కమిషనర్ డా.స్రిజన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయ ఈఓ ఎంవీసూర్యకళ కమిషనర్ స్వాగతం పలికి స్వామివారికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం కమిషనర్ అప్పన్నకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారు కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. వారికి దేవస్థానం వేదపండితులు ఆశీర్వచనాలు అందించగా, అధికారులు ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.